విజయవంతంగా ముగిసిన పది రోజుల “సంఘటన సృజన్ అభియాన్” శిక్షణ శిబిరం



                     పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన రాహుల్ గాంధీ

వికారాబాద్ మార్చ్ 2 (ఆయుధం న్యూ స్); వికారాబాద్ హరిత రిసార్ట్‌లో “సంఘటన సృజన్ అభియాన్” కార్యక్రమం భాగంగా నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణ శిబిరం ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ కేసి వేణు గోపాల్  సీఎం రేవంత్ రెడ్డి   విచ్చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి  నటరాజన్

టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారుఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్,తదితరులు పాల్గొన్నారు.  పది రోజులపాటు కొనసాగిన ఈ శిక్షణ శిబిరంలో పార్టీ సంస్థాగత బలోపేతంనాయకత్వ సామర్థ్యాల అభివృద్ధిప్రజలతో అనుసంధానంఎన్నికల వ్యూహరచన వంటి అంశాలపై సమగ్ర చర్చలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన డీసీసీ అధ్యక్షులు తమ తమ జిల్లాల రాజకీయ పరిస్థితులుబూత్ స్థాయి నిర్మాణంప్రజా సమస్యలపై పార్టీ స్పందన తదితర అంశాలను విశ్లేషిస్తూ అనుభవాలను పంచుకున్నారు.  “సంఘటన సృజన్” ప్రోగ్రామ్ చైర్మన్ సచిన్ రావ్ ఆధ్వర్యంలోఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా వంశీ చందర్ రెడీఎమ్మెల్యే పరిగి రాంమోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ శిబిరం సమర్థవంతంగా నిర్వహించబడింది.
వివిధ రంగాల నిపుణులు నాయకత్వ నైపుణ్యాలు
ప్రజా సమస్యల పరిష్కార విధానాలుసోషల్ మీడియా మీడియా నిర్వహణఎన్నికల వ్యూహరచనకార్యాచరణ ప్రణాళికల రూపకల్పన వంటి అంశాలపై శిక్షణ అందించారు.   రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో శిక్షణా శిబిరం ముగిసింది.