ఫర్టిలైజర్ కంపెనీ యాజమానితో పాటు 56 మంది ఫర్టిలైజర్స్ డీలర్స్ అరెస్టు
హైదరాబాద్ అక్టోబర్ 16 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి రిసార్ట్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏపీకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ యాజమానితో పాటు 56 మంది ఫర్టిలైజర్స్ డీలర్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. యువతులతో ముజ్రా, అర్ధనగ్న డ్యాన్స్, క్యాసినో సైతం ఏర్పాటు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రెస్క్యూ హోమ్ కు 20 మంది యువతులు పంపించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ శివారులో మాజీ సర్పంచ్ రాకేష్ రెడ్డికి చెందిన 'కే చంద్రశేఖర్ రెడ్డి' అనే రిసార్ట్ పై పోలీసుల దాడి చేశారు. గాజులరామారంలో వేద అగ్రి ఇన్వరేషన్ పేరుతో తిరుపతిరెడ్డి, ఇబ్రహీంపట్నం రాందాస్ పల్లిలో రాక్ స్టార్ హైబ్రిడ్ సీడ్స్ పేరుతో సైదారెడ్డి విత్తనాలు తయారు చేసేవారు. తమ ఉత్పత్తులను భారీగా డీలర్లకు విక్రయించుకోవడంతో వారికి పార్టీ ఇచ్చేందుకు మంగళవారం రాత్రికి రాకేష్ రెడ్డికి చెందిన రిసార్ట్ను తిరుపతి రెడ్డి, సైదారెడ్డి కిరాయికి తీసుకొని రేవ్ పార్టీ నిర్వహించారు
