జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థిగా లంక దీపక్ రెడ్డి

హైదరాబాద్ అక్టోబర్ 15 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థిగా లంక దీపక్ రెడ్డి పేరు ఖరారు అయింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు అభ్యర్థిని బిజెపి ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2023 లోనూ జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ లో బిఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా దీపక్ రెడ్డి ఉన్నారు.