హైదరాబాద్ అక్టోబర్ 15 (ఎక్స్ ప్రెస్ న్యూ స్): తెలంగాణలో దొంగఓట్లు తెచ్చిందే బిఆర్ఎస్ పార్టీ అని బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ తెలిపారు. బంగ్లాదేశ్, మయన్మార్ దేశీయులకు గతంలో ఆశ్రయం ఇచ్చింది బిఆర్ఎస్ అని అన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ విమర్శలు చేశారు. బోధన్ లో 42 దొంగ పాస్ పోర్టులు ఇచ్చిందని మరిచారా అని జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ దందాకు తెరలేపింది కెటిఆర్ కాదా? అని అర్వింద్ ప్రశ్నించారు.
