భారీగా నృసింహుని హుండీ ఆదాయం

 

 రూ.2,45,48,023 కోట్ల నగదుతో పాటు ,బంగారం,వెండి,విదేశీ  కరెన్సీ 

యాదగిరిగుట్టజూలై 23 (ఆయుధం  న్యూ స్);: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి 41 రోజుల హుండీలను బుధవారం లెక్కించారు . 38 గ్రాముల మిశ్రమ బంగారంరెండు కిలోల 8 00గ్రాముల మిశ్రమ వెండి తో పాటు ₹ 2,45,48,023 ( రెండు కోట్ల నలబై ఐదు  లక్షల నలభై ఎనిమిది వేల ఇరవై మూడు రూపాయలు) నగదు ఆదాయం హుండీల ద్వారా సమకూరినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. విదేశీ కరెన్సీ కూడా సమకూరినట్లు ఆయన వివరించారు.🇺🇸అమెరికా-  1036 డాలర్లు,🇦🇺 ఆస్ట్రేలియా -    5 డాలర్లు, ఇంగ్లాండ్- 45 పౌండ్స్,🇸🇦 సౌదీ అరేబియన్ -5 రియల్,🇸🇬 ింగపూర్ -  10 డాలర్స్ ,🇶🇦 కతర్  - 1/2రియల్,🇴🇲 ఒమన్ - 500 బైస ,🇦🇪అరబ్ ఎమిరేట్స్-  70 థీర మ్స్, శ్రీలంక - 500.,    మలేసియా -  23రింగిట్స్,  కెనడా   -       20 డాలర్స్,  బెహ్రిన్ -         2 . హుండీ లెక్కింపులో అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి కూడా పాల్గొన్నారు.