జిల్లాలో బిజెపిని సంస్థాగతంగా బలోపేతం చేస్తాం*

 



జిల్లాలో బిజెపిని సంస్థాగతంగా బలోపేతం చేస్తాం*

*నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షునిగా చెవ్వ ప్రమోద్ ఎన్నిక*

వేముల నరేందర్ రావు
బిజెపి జిల్లా అధ్యక్షులు

నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి నూతన మండల అధ్యక్షులను ఈరోజు బిజెపి జిల్లా ప్రారంభ జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు ప్రకటించడం జరిగింది. సంస్థ గత ఎన్నికల సహాచార్జ్, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్‌తో కలిసి విలేఖరులతో మాట్లాడుతూ ఇన్‌స్టిట్యూట్‌గా పార్టీని నిర్వహించారు. పటిష్ట పరచడానికి బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే నూతన మండల కమిటీలను ఏర్పాటు చేశామని జిల్లా కమిటీ త్వరలో పూర్తి కానుంది
దేశంలో జనగణనతోపాటు కులగణన చేయడం చరిత్రాత్మకమైన నిర్ణయం.. ఇంతటి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
స్వతంత్ర భారతదేశంలో 58 ఏళ్లు ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.
వారు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు బీసీల జనగణన చేపట్టలేదు.
అణగారిన వర్గాలకు ఛాంపియన్ అని చెప్పి బీసీ ,ఎస్సీ, ఎస్టీల ఓట్లు కొల్లగొట్టారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ముసలికన్నీరు కారుస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
బీజేపీ 2014లో ఓబీసీ బిడ్డను ఈ దేశ ప్రధానమంత్రిని చేసింది.
కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలను,
12 మంది ఎస్సీలను, 8 మంది ఎస్టీలను, 5 మంది మైనారిటీలకు స్థానం కల్పించారు.
60 శాతం మంది ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి గౌరవం ఇచ్చారు.
2014 లో ఒక దళిత బిడ్డను
2021 లో ఆదివాసి అడవి బిడ్డను రాష్ట్రపతులను చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది.
ముసలికన్నీరు కార్చే కాంగ్రెస్ కి చెంపపెట్టు లాగా దేశంలో కులగణన చేపట్టనుంది.
ఇది హర్షణీయం.
ఓబీసీలకు గొప్ప గుర్తింపు.
రాజకీయ సామాజిక విద్యా ఉద్యోగాల పరంగా ఓబీసీలకు అవకాశాలు మరింత పెరుగుతాయి.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము.
మోదీ గారికి కేంద్ర కేబినెట్ మంత్రులకు కృతజ్ఞతలు.
బిజెపి ఒక్కటే అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని ఇది నిరూపించిందని అన్నారు.

Post a Comment

Previous Post Next Post