వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన,


 కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలి,

మిల్లర్లు

లోడింగ్, అన్లోడింగ్ విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలి,
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన,
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,



ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని, మిల్లర్లు లోడింగ్ అన్‌లోడింగ్ విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, చెప్పారు.
శుక్రవారం, నాగర్ కర్నూల్ సంస్థ నల్లవెల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నీ జిల్లా కలెక్టర్ దేవ సహాయం, తహశీల్దార్ తబిత రాణి లతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, సందర్శించి, పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ధాన్యం రైతులు ఆరబోసిన తేమ శాతాన్ని, ధాన్యం కొనుగోళ్ల రిజిస్టర్లను తనిఖీ చేసి, ఓపీఎంఎస్‌లో నమోదు చేస్తున్నారా? రైతులు ఆరబోసిన ధాన్యం తేమ శాతాన్ని ప్రతిరోజూ చూస్తున్నారా? సకాలంలో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారా? అలాగే వ్యవసాయ రైతులు ఆరబోసిన ధాన్యం కుప్పల గురించి పలు వివరాలను కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
తాజా ధాన్యం కొనుగోలు వివరాలను ఓపీఎంఎస్‌లో నమోదు చేయనున్నామని, రైతులు ఆరబోసిన ధాన్యం తేమ శాతాన్ని కూడా ప్రతిరోజూ పరిశీలించి, కావాల్సిన తేమ శాతం రాగానే కాంటా పూర్తిచేసి మిల్లులకు తరలిస్తున్నామని కేంద్ర నిర్వాహకులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు.
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, మాట్లాడుతూ,........ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన వెంటనే ఓపీఎంఎస్ లో వివరాల నమోదు అందుచేత, అదే సమయంలో రైతులకు డబ్బులు అందజేయడం, అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువ రోజుల వరకు విదేశాలకు పెట్టుకోకుండా తేమ శాతం రాగానే కాంటా పూర్తిచేసి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. నిత్యం అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, పౌరసరఫరాల శాఖ అధికారులు రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, పరిశీలించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర నిర్వాహకులను హెచ్చరించారు. తాలు లేకుండా సరిచూసుకోవాలని, తేదీ, రైతు పేరు, ఫోన్ నంబర్, ధాన్యం కొనుగోళ్ల పూర్తి వివరాలతో రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయాలి, తేమ శాతం వచ్చింది ధాన్యం కొనుగోలు పూర్తిచేసి, అదే రోజు సంబంధిత మిల్లులకు వెంటనే తరలించాలని, కేంద్రాల్లో ఎక్కువ రోజుల వరకు నిల్వ చేయకూడదని కేంద్ర నిర్వాహకులను ముందుగా.అంతకుముందు రైస్ మిల్లును సందర్శించి ధాన్యం లోడింగ్ అన్ లోడింగ్ స్టాక్ రిజిస్టర్ పరిశీలించి సమర్థ నిర్వహణకు తగిన సూచనలు చేశారు.

Post a Comment

Previous Post Next Post