*మహిళలకు, బాలికలకు భద్రత – షీటీమ్స్ సేవలు*
మహబూబ్ నగర్ జిల్లాలో విద్యాసంస్థలు, రద్దీ ప్రదేశాల్లో షీటీమ్స్ సిబ్బంది నిరంతరం నిఘా పెట్టి మహిళల భద్రతను కాపాడుతున్నారు. వేధింపులకు గురైన వారు షీ టీం నెంబరు 8712659365 లేదా డయల్ 100 కు ఫిర్యాదు చేయవచ్చు.
*ఏప్రిల్ నెలలో జరిగిన కార్యాచరణ:*
మొత్తం ఫిర్యాదులు: 15
కౌన్సిలింగ్: 10
రెడ్ హ్యాండెడ్ కేసులు: 5
అవగాహన కార్యక్రమాలు: 5
హాట్ స్పాట్ విజిట్స్: 45
జిల్లా ఎస్పీ శ్రీమతి జానకి IPS గారు మాట్లాడుతూ
షీ టీమ్స్ సిబ్బంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్ వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈవిటీజింగ్, ర్యాగింగ్, పోక్సో చట్టాలు మానవ అక్రమ రవాణా, సోషల్ మీడియా వినియోగం, గుడ్ టచ్-బ్యాడ్ టచ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు.
విద్యార్థులు తమ భవిష్యత్తును రక్షించుకోవాలని, ఎలాంటి వేధింపులకు గురైన వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
షీటీమ్స్ సిబ్బంది సివిల్ డ్రస్సుల్లో నిత్యం నిఘా ఉన్నారు.
అవసరమైన సమయంలో డయల్ 100 లేదా షీ టీమ్ నంబర్ 8712659365 కు సంప్రదించండి.
మహిళల వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయి.