మనసేవా సమితి ఆధ్వర్యంలో - గర్బీణులకు మాస్కులు, మజ్జిగ, శానిటైజర్స్ పంపిణీ



జడ్చర్ల, (ఆయుధం న్యూస్) :   పట్టణంలోని గర్భిణులకు మనసేవా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు వడ్లవేణు బుధవారం మాస్కులు, మజ్జిగ, శానిటైజర్స్ పంపిణీ చేశారు.   ఈ సందర్భంగా   మాట్లాడుతూ లాక్ డౌన్ సందర్భంగా నిరుపేదలకు యువత ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాడానికి ప్రతిఒక్కరు ఇంట్లో ఉండి కరోనాను తరిమి కోట్టాలన్నారు. మాస్కులు ప్రతి ఓక్కరుదరించాలని సూచించారు. కార్యక్రమంలో మన సేవా సమితి ఉపాద్యాక్షులు రవింర్ రెడ్డి, ప్రదాన కార్యదర్శి ఎన్నంరాఘవేంధర్, కోశాధికారి రఘుమారెడ్డి, ప్రచార కార్యదర్శి చాకలియాదగిరి, కార్యదర్శి విజయ్ కుమార్, సలహదారులు  గోనేలరాధాకృష్ణ, సంతోష్ లు పాల్గొన్నారు.